Ragi రాగుల కొనుగోలు కేంద్రం ప్రారంభం
ABN , Publish Date - May 22 , 2026 | 12:03 AM
మండల కేంద్రంలో సచివాలయం వద్ద రాగుల కొనుగోలు కేంద్రాన్ని టీడీపీ నాయకులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్ రూ.4886తో నిర్ణయించిందన్నారు.
పరిగి, మే 21(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో సచివాలయం వద్ద రాగుల కొనుగోలు కేంద్రాన్ని టీడీపీ నాయకులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్ రూ.4886తో నిర్ణయించిందన్నారు.
రైతులు రాగులను ఈ కొనుగోలుకేంద్రం వద్దకు తీసుకొచ్చి అమ్మకాలు జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతప్ప, తెలుగు యువత జిల్లా కార్యదర్శి ప్రవీణ్రెడ్డి, నాయకుడు వడ్డె శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..