RDO: డ్రాఫ్ట్ పట్టాదార్ పాసు పుస్తకం సర్వేపై పరిశీలన
ABN , Publish Date - Feb 05 , 2026 | 12:20 AM
మండల పరిధిలోని జీనుల కుంట, సామచేను బైలులో నిర్వహించిన డ్రాఫ్ట్ పట్టాదార్ పాసు పుస్త కం సర్వే కార్యక్రమాన్ని ఆర్డీవో వీవీఎస్ శర్మ బుధవారం పరిశీలించారు. కొన్ని నెలలుగా జీనులకుంట, సామచేనుబైలు గ్రామాల్లో భూ రీ సర్వే ప్రక్రియను నిర్వహించారు.
గాండ్లపెంట, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని జీనుల కుంట, సామచేను బైలులో నిర్వహించిన డ్రాఫ్ట్ పట్టాదార్ పాసు పుస్త కం సర్వే కార్యక్రమాన్ని ఆర్డీవో వీవీఎస్ శర్మ బుధవారం పరిశీలించారు. కొన్ని నెలలుగా జీనులకుంట, సామచేనుబైలు గ్రామాల్లో భూ రీ సర్వే ప్రక్రియను నిర్వహించారు. ఈ రీసర్వేపై రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. డ్రాఫ్ట్ పట్టాదార్ పాసు పుస్తకంలో వివరాలు తెలియజేసిర, రైతుల ఆమోదం పొందిన తరువాత తప్పులు లేకుండా రాజముద్ర కలిగిన పాస్ పుస్తకాలు అందించేందుకు ఈ గ్రామ సభ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాబూరావు, మండల సర్వేయర్ చందన, వీఆర్ఓలు చంద్రశేఖర్, రామ్మోహన, క్రిష్టప్ప, రైతులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....