GOD: హంస వాహనంపై నారసింహుడు
ABN , Publish Date - May 03 , 2026 | 12:09 AM
మండల పరిధిలోని పెన్నహో బిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం హంస వాహనంపై నారసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతా ళాల మధ్య ఆలయం చుట్టూ ఊరేగించారు.
ఉరవకొండ, మే 2(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని పెన్నహో బిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం హంస వాహనంపై నారసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళతా ళాల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి, హంసవాహనంపై కొలువుదీర్చి, ఆలయం చుట్టూ ఊరేగించారు. వేలూ రు రంగయ్య, కుటుంబసభ్యులు దాతలుగా వ్యవహరించారు. ఆలయ సిబ్బంది మారుతి, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం హనుమంత వాహనోత్సవం నిర్వహిస్తారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....