CHURCH: ఘనంగా ఈస్టర్ వేడుకలు
ABN , Publish Date - Apr 05 , 2026 | 11:20 PM
క్రైస్తవులు ఆదివారం గుత్తి, గుత్తి ఆర్ఎస్ పట్టణాలలో ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్ట ణంలోని సీఎస్ఐ చర్చి, బైబుల్ మిషన, రోమన క్యాథిలిక్ చర్చితో పాటు పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
- చర్చిలలో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు
గుత్తి, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): క్రైస్తవులు ఆదివారం గుత్తి, గుత్తి ఆర్ఎస్ పట్టణాలలో ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్ట ణంలోని సీఎస్ఐ చర్చి, బైబుల్ మిషన, రోమన క్యాథిలిక్ చర్చితో పాటు పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈస్టర్ పర్వదినాన్ని పురస్క రించుకుని భక్తులు పెద్ద ఎత్తున్న చర్చిలలో ప్రార్థనలో పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం: ఈస్టర్ వేడుకలను ఆదివారం పట్టణంలోని చర్చిలలో క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. కంబదూరులోని న్యూ సీఅండ్ఐజీ మిషన చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. చర్చి ఫాస్టర్ జోయెల్, సెకెరట్రీ ప్రభాకర్ క్రీస్తు సందేశాలను వినిపించారు. క్రైస్తవులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....