GOD: ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలు
ABN , Publish Date - Apr 22 , 2026 | 11:31 PM
పట్టణం లోని సంజీవనగర్లో ఉ న్న వేదమాత గాయత్రీ ఆ లయంలో బుధవారం ఆది శంకరాచార్యులు జయంతి వేడుకలను ఘనంగా ని ర్వహించారు. ఆలయ అ ర్చకులు హర్షశర్మ ఆధ్వ ర్యంలో జరిగిన ఈ కార్య క్రమంలో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ఆయన సతీమణి జేసీ ఉమారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తాడిపత్రి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): పట్టణం లోని సంజీవనగర్లో ఉ న్న వేదమాత గాయత్రీ ఆ లయంలో బుధవారం ఆది శంకరాచార్యులు జయంతి వేడుకలను ఘనంగా ని ర్వహించారు. ఆలయ అ ర్చకులు హర్షశర్మ ఆధ్వ ర్యంలో జరిగిన ఈ కార్య క్రమంలో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ఆయన సతీమణి జేసీ ఉమారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య మహాన్యాస పూర్వక ఏకాదశవార రుద్రాభిషేకం, రుద్రహోమం నిర్వహించారు. ఆది శంకరాచార్యుల చిత్రప టానికి పూలమాలలు వేసి ఘనంగా పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్య్డేని అర్చకులు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....