GAMES: క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:42 PM
క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రధానోపాధ్యాయుడు ఖాదర్బాషా పేర్కొన్నారు. ఇటీవల ఖో-ఖో పుట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను బుధవారం స్థానిక జిల్లా పరిషత సెంట్రల్ ఉన్నత పాఠశాలలో అభినందించారు.
ఉరవకొండ, మార్చి 4(ఆంధ్రజ్యోతి): క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రధానోపాధ్యాయుడు ఖాదర్బాషా పేర్కొన్నారు. ఇటీవల ఖో-ఖో పుట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను బుధవారం స్థానిక జిల్లా పరిషత సెంట్రల్ ఉన్నత పాఠశాలలో అభినందించారు. గత నెల23వ తేదీన బత్తలపల్లిలో జరిగిన పుట్బాల్ లీగ్ పోటీలలో తమ పాఠశాలకు చెందిన బాలికల జట్టు ప్రతిభ కనబపరిచి ట్రోపీని కైవసం చేసుకుందని పీడీ మారుతి తెలిపారు. అలాగే రథోత్సవాన్ని పు రస్కరించుకుని నిర్వహించిన జిల్లా స్థాయి ఖో-ఖో పోటీలలో బాలురు, బాలికల జట్లు రెండూ ప్రథమ స్థానంలో నిలిచాయని తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....