Vijayawada: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఇందిరా ఫుడ్స్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ
ABN, Publish Date - Aug 26 , 2025 | 07:12 PM
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. రేపు గణేశ్ చతుర్థి పర్వదినం కావడంతో విగ్రహాల ఏర్పాటుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో
విజయవాడ: తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. రేపు(బుధవారం) గణేశ్ చతుర్థి పర్వదినం కావడంతో విగ్రహాల ఏర్పాటుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంలో భాగంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఇందిరా ఫుడ్స్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ చేస్తున్నారు. ప్రజలలో ఆధ్యాత్మిక భావం పెంచే దిశగా బొజ్జ గణపయ్యలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అందిస్తోంది. గత 15 ఏళ్లుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఇందిరా ఫుడ్స్ సంయుక్తంగా వినాయకుని మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నాయి.
Updated at - Aug 26 , 2025 | 07:14 PM