పాక్ నేతల ఓవరాక్షన్..
ABN, Publish Date - May 01 , 2025 | 02:28 PM
భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య పాక్ నేతలు మరింత రెచ్చిపోతున్నారు. తమ నోటికి పని చెబుతున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్పై పాక్ సెనెటర్ పాల్వాషా మొహమ్మద్ జై ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో కొత్త బాబ్రీ మసీదు నిర్మాణానికి పాక్ సైనికులే పునాది వేస్తారు. కొత్త బాబ్రీ మసీద్కు మొదటి ఇటుకను..
భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య పాక్ నేతలు మరింత రెచ్చిపోతున్నారు. తమ నోటికి పని చెబుతున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్పై పాక్ సెనెటర్ పాల్వాషా మొహమ్మద్ జై ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో కొత్త బాబ్రీ మసీదు నిర్మాణానికి పాక్ సైనికులే పునాది వేస్తారు. కొత్త బాబ్రీ మసీద్కు మొదటి ఇటుకను.. ఆర్మీ చీఫ్ మునీర్ స్వయంగా ఇస్తారని వ్యాఖ్యానించారు. యుద్ధం జరిగితే పాక్పై సిక్కు సైన్యం దాడి చేయదని, ఎందుకంటే పాక్ సిక్కులు, గురునానక్కు సంబంధించిన భూమి పాల్వాషా అన్నారు. పాకిస్థానీయులు బలహీనులు కాదని.. గాజులు తొడ్డుక్కోలేదంటూ రెచ్చిపోయి మాట్లాడారు.
Updated at - May 01 , 2025 | 02:28 PM