Maha Kumbh Mela: మహా కుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతులు..
ABN, Publish Date - Feb 17 , 2025 | 06:15 PM
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ దంపతులు మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమం షాహి స్నాన ఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానమాచరించారు. లోకేష్, బ్రాహ్మణి దంపతులు గంగాదేవికి పూజలు చేసి, హారతులిచ్చారు.
అమరావతి, ఫిబ్రవరి 17: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ దంపతులు మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించారు. త్రివేణి సంగమం షాహి స్నాన ఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానమాచరించారు. లోకేష్, బ్రాహ్మణి దంపతులు గంగాదేవికి పూజలు చేసి, హారతులిచ్చారు. పితృదేవతలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు. పూర్వీకులకు మోక్షమార్గాన్ని ప్రసాదించాలంటూ గంగాదేవిని ప్రార్థించారు. కుంభమేళా ప్రాంగణంలో ప్రతిధ్వనించే కీర్తనలు, నదీ సంగమం వద్ద పవిత్ర పూజల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో లోకేష్ దంపతులు మమేకమయ్యారు. మహా కుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు.. ఇది భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం. నమ్మకం, ఆచారాలు, ఆధ్యాత్మిక జ్ఞానంతో ముడిపడి ఉన్న శక్తిమంతమైన వేడుక. మానవత్వం, ఆధ్యాత్మికత మధ్య సంబంధాన్ని, లోతుగా నాటుకుపోయిన భారతజాతి విలువలను ప్రతిబింబిస్తుంది. పవిత్ర నదుల్లో ఆచరించే స్నానం, దానం, హృదయ పూర్వకమైన భక్తి మోక్ష మార్గాన్ని చూపిస్తాయని కోట్లాదిమంది నమ్మకం. కుంభమేళాలో స్నానాలు, పూజాధికాల అనంతరం లోకేష్ దంపతులు కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని సందర్శించేందుకు వారణాసి వెళ్లారు.
Updated at - Feb 17 , 2025 | 06:47 PM