మామ కోసం భర్తను లేపేసిన భార్య

ABN, Publish Date - Jul 03 , 2025 | 07:25 PM

కట్టుకున్న భర్తలను దారుణంగా హత్య చేస్తున్న భార్యల ఉదంతాలు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజా ఈ తరహా ఘటన బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

కట్టుకున్న భర్తలను దారుణంగా హత్య చేస్తున్న భార్యల ఉదంతాలు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజా ఈ తరహా ఘటన బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. తన మామయ్యను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో గుంజాదేవి.. తన భర్తను సుపారీ గ్యాంగ్‌తో హత్య చేయించింది. ఈ సందర్భంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా ఆమె కాల్ రికార్డును పోలీసులు పరిశీలించారు.

అందులో సంచలన నిజాలను పోలీసులు బహిర్గతం చేశారు. పెళ్లికి ముందు గుంజా దేవి.. తన మామయ్యతో ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలిపింది. ఈ పెళ్లికి వారు నిరాకరించారు. అదే సమయంలో మరో వ్యక్తితో గుంజా దేవికి పెళ్లి నిశ్చయం చేశారు. ఇష్టం లేని పెళ్లి చేయడంతో గుంజా దేవి.. తన భర్తను సుపారీ ఇచ్చి హత్య చేయించింది.

ఈ వీడియోలను వీక్షించండి..

జోలె పట్టి భిక్షాటన చేసిన రఘువీరా రెడ్డి

ముగిసిన IAS అధికారి అరవింద్ కుమార్ విచారణ

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 03 , 2025 | 07:25 PM