వామ్మో.. కిలాడీ మహిళలు
ABN, Publish Date - Feb 20 , 2025 | 04:10 PM
Fake Gold: నెల్లూరు జిల్లాలో ఇద్దరు మహిళలు ఏకంగా బంగారు షాపు యజమానినే బురిడీ కొట్టించారు. నకిలీ బంగారాన్ని షాపుకు తీసుకొచ్చిన మహిళలు అసలు బంగారంతో ఉడాయించారు.
నెల్లూరు, ఫిబ్రవరి 20: జిల్లాలోని ఉదయగిరిలో ఇద్దరు మహిళలు నకిలీ బంగారంతో షాపు యజమానికి కుచ్చుటోపీ పెట్టారు. బంగారం షాపుకు నకిలీ బంగారం (Gold) తీసుకువచ్చిన మహిళలు షాపు యజమానిని మాటల్లో పెట్టి బంగారం వస్తువులతో పాటు ఐదువేల నగదును దొంగలించారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన యజమాని ఆ కిలాడీల కోసం చుట్టుపక్కల గాలించారు. అయితే అప్పటికే ఆ మహిళలు ఇద్దరు ఆ ప్రాంతం నుంచి పరారవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
Robbery: హైటెక్ చోరీ.. ఖంగుతిన్న పోలీసులు
Vamshi Case: వంశీ కస్టడీ పిటిషన్పై ముగిసిన వాదనలు.. కోర్టు ఏం చెప్పిందంటే
Read Latest AP News And Telugu News
Updated at - Feb 20 , 2025 | 04:10 PM