భూమనకు టీడీపీ కార్యకర్త సవాల్..
ABN, Publish Date - Feb 03 , 2025 | 12:24 PM
తిరుపతిలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారు. కూటమిలో చేరారు. పాలనలో తమకు స్వేచ్ఛలేదని కూటమిలో చేరడంవల్ల తమకు గౌరవం పెరిగిందని కార్పొరేటర్లు అన్నారు. ఓటింగ్లో పాల్గొనేందుకు వెళుతున్న కార్పొరేటర్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో అన్నారు.
తిరుపతి: మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నిక జరుగుతోంది. ఈ సందర్భంగా కూటమి తరఫున డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు.. వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అభ్యర్థి ఓడిపోతారనే భయంతో కొంతమంది గూండాలను వెంట పెట్టుకుని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. కార్పొరేటర్లను ఎత్తుకుపోతున్నారని.. అయినా కూటమి తరఫున మంచి మెజారిటీతో గెలుస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు పూర్తి మెజారిటీ ఉందని.. కరుణారెడ్డి లాడ్జీలో ఉండి రచ్చ చేయిస్తున్నారని, ధైర్యం ఉంటే బయటకు రావాలని ఆయన సవాల్ చేశారు.
ఈ వార్త కూడా చదవండి..
హిందూపురం మున్సిపల్ చైర్మన్గా టీడీపీ నేత ఎన్నిక..
మరోవైపు తిరుపతిలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారు. కూటమిలో చేరారు. పాలనలో తమకు స్వేచ్ఛలేదని కూటమిలో చేరడంవల్ల తమకు గౌరవం పెరిగిందని కార్పొరేటర్లు అన్నారు. ఓటింగ్లో పాల్గొనేందుకు వెళుతున్న కార్పొరేటర్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో అన్నారు. గతంలో జరిగినట్లు ఎలాంటి ఇబ్బందులు లేవని.. ప్రశాంతంగా వెళ్లి తాము ఓటు వేస్తున్నామని చెప్పారు. తమకు కావాల్సిన డిప్యూటీ మేయర్ను గెలిపించుకుంటామని వారు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వానికే తమ మద్దతు అంటూ కార్పొరేటర్లు ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమెరికాలో యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానంలో మంటలు
గుంటూరు జిల్లాలో వృద్దురాలిపై దారుణం..
ఆ పదవి కోసం మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యూహం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 03 , 2025 | 12:24 PM