కన్నతల్లిని బస్ స్టాండ్ లో వదిలి వెళ్లిపోయిన కొడుకు
ABN, Publish Date - Jun 17 , 2025 | 04:06 PM
కన్నతల్లిని నిర్దాక్షిణ్యంగా బస్టాండ్లో వదిలివేశాడు ఒక కసాయి కొడుకు. వనపర్తి జిల్లా పీర్ల గుట్టకు చెందిన పార్వతమ్మ గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది.
కన్నతల్లిని నిర్దాక్షిణ్యంగా బస్టాండ్లో వదిలివేశాడు ఒక కసాయి కొడుకు. వనపర్తి జిల్లా పీర్ల గుట్టకు చెందిన పార్వతమ్మ గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. హైదరాబాద్ తీసుకు వెళ్లి.. ఆసుపత్రిలో చూపిస్తామని ఆమె కొడుకు భాస్కర్ నమ్మపలికాడు. కొడుకు మాటలు నమ్మి అతడి వెంట వెళ్లింది. ఆమెను బస్టాండ్లో దింపి.. అక్కడే కూర్చోవాలని అరగంటలో వస్తానని చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత అతడు తిరిగి రాలేదు. దాంతో గత మూడు రోజులుగా ఆమె బస్టాండ్లోనే ఉంటుంది. కొడుకు రాక కోసం ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
ఈ వీడియోలు సైతం వీక్షించండి..
ఐఏఎస్ అరవింద్ కుమార్ కు సెలవు..సీఎం రేవంత్ సీరియస్
మద్యం కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్కు రంగం సిద్దమైందా..?
మరిన్నీ ఏబీఎన్ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jun 17 , 2025 | 04:09 PM