సింహాచలం మృతుల కుటుంబాలకు పవన్ ప్రగాఢ సానుభూతి

ABN, Publish Date - Apr 30 , 2025 | 12:46 PM

సింహాచలం ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సింహాచలం ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు, క్షతగాత్రుల కుటుంబాలకు రూ. 3 లక్షలు చొప్పున ప్రభుత్వం పరిహారం ఇవ్వనుంది.అలాగే ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించింది. ఇక ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 30 , 2025 | 12:46 PM