ఆపరేషన్ సిందూర్పై చైనా, అమెరికా స్పందన
ABN, Publish Date - May 08 , 2025 | 09:53 AM
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగడం దురదృష్టకరమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరు దేశాలు చాలా ఏళ్లుగా పోరాడుతున్నాయని, గత అనుభవాల ప్రకారం ఏదో ఒకటి జరగబోతోందని ప్రజలకు ముందే తెలుసునని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు త్వరగా చల్లారాలని ఆయన ఆకాంక్షించారు.
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై ప్రపంచ దేశాల స్పందించాయి. భారత్ (India), పాక్ (Pok) సమన్వయం పాటించాలని, చర్చల ద్వార సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని చైనా (China) వ్యతిరేకిస్తుందని ఆ విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. భారత సైనిక చర్యపై విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. భారత్, పాకిస్తాన్ ఎప్పటికీ దాయాది దేశాలేనని, చైనాకు పొరుగు దేశాలే అన్నారు. అన్ని రకాల ఉగ్రవాదాన్ని చైనా వ్యతిరేకిస్తుందని చెప్పారు. భవిష్యత్ పరిణామాలను పరిగణలోకి తీసుకుని ఇరు దేశాలు సంయమనం పాటించాలని అన్నారు.
Also Read: పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగడం దురదృష్టకరమని అమెరికా (America) అధ్యక్షుడు డోనాల్డ్ (Donald Trump) ట్రంప్ అన్నారు. ఇరు దేశాలు చాలా ఏళ్లుగా పోరాడుతున్నాయని, గత అనుభవాల ప్రకారం ఏదో ఒకటి జరగబోతోందని ప్రజలకు ముందే తెలుసునని అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు త్వరగా చల్లారాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాక్ కవ్వింపు చర్యలు.. తిప్పికొట్టిన భారత్ సైన్యం..
న్యాయం జరిగింది: సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కుటుంబం
For More AP News and Telugu News
Updated at - May 08 , 2025 | 09:53 AM