నాకు ఏమి అవసరం లేదు: మంత్రి కోమటిరెడ్డి

ABN, Publish Date - Feb 10 , 2025 | 10:47 AM

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం తెల్లవారుజామున ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో పాల్గొని బ్రహ్మ ముహూర్తంలో షాహీ పుణ్యస్నానం ఆచరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు.. ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజా ప్రభుత్వానికి నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడేందుకు మరింత శక్తిని ప్రసాదించాలని ఆ దేవదేవుడిని కోరుకున్నట్లు ఆయన చెప్పారు.

ఉత్తరప్రదేశ్: ప్రయోగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లారు. సంఘం ఘాట్‌లో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా పర్వదినం.. కోట్లాదిమంది భక్తులు తరలి వచ్చి తమ భక్తిని చాటుకుంటారని అన్నారు. సోమవారం ఉదయం బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం ఈ జన్మలో చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ జన్మకు ఇది చాలని.. ఇక తనకు ఏమి అవసరం లేదని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

ఈ ఫోటోలు కూడా చూడండి..

యాదాద్రి పాతగుట్ట బ్రహ్మోత్సవాలు


మంత్రి కోమటిరెడ్డి సోమవారం తెల్లవారుజామున ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో పాల్గొని బ్రహ్మ ముహూర్తంలో షాహీ పుణ్యస్నానం ఆచరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజా ప్రభుత్వానికి నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడేందుకు మరింత శక్తిని ప్రసాదించాలని ఆ దేవదేవుడిని కోరుకోవడం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ నేతకు లిక్కర్ స్కామ్ చిక్కులు

పాతబస్తీ దివాన్‌దేవిడిలో భారీ అగ్ని ప్రమాదం..

దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Feb 10 , 2025 | 10:49 AM