మృ*తదేహాల కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూపులు
ABN, Publish Date - Nov 17 , 2025 | 06:13 PM
సౌదీ అరేబియాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 45 మంది యాత్రికులు మృతి చెందారు. మక్కా నుంచి మదీనాకు యాత్రికులతో వెళ్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
సౌదీ అరేబియా, నవంబర్ 17 : మదీనాకు సమీపంలో ఘోర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 45 మంది యాత్రికులు మృతి చెందారు. మక్కా నుంచి మదీనాకు యాత్రికులతో వెళ్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 45 మంది యాత్రికులు మరణించారు. ఈ నెల 9న హైదరాబాద్ కు చెందిన 54 మంది యాత్రికులు మక్కాకి వెళ్లారు. హైదరాబాద్ మల్లేపల్లిలోని ఆల్మీనా ట్రావెల్స్ నుంచి 20 మంది, మెహిదీపట్నంలోని ఫ్లైజోన్ ట్రావెల్స్ నుంచి 24 మంది మక్కా వెళ్లేందుకు టికెట్స్ బుక్ చేసుకున్నారు. మరో ఇద్దరు మరో ఏజెన్సీ ద్వారా మక్కాకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో బస్సులో నుంచి దూకి మహ్మద్ అబ్దుల్ అనే యాత్రికుడు ప్రాణాలు దక్కించుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
88 గంటల ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్... ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
ఢిల్లీలో కారు పేలుడుకు ‘మదర్ ఆఫ్ సైతాన్’?
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.
Updated at - Nov 17 , 2025 | 06:15 PM