బస్సులు ఎలా నడిపిస్తారో చూస్తా..జేసీ ప్రభాకర్ వార్నింగ్
ABN, Publish Date - Apr 20 , 2025 | 08:55 PM
హైదరాబాదులో ప్రైవేట్ బస్సు ఓనర్స్ సమావేశంపై జేసీ ప్రభాకర రెడ్డి మండిపడ్డారు. ఈ సమావేశానికి తమను ఆహ్వానించక పోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు తాము తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళమేనని.. తమను గద్వాల రాజులు అంటారని గుర్తు చేశారు.
అనంతపురం,ఏప్రిల్ 20:హైదరాబాదులో ప్రైవేట్ బస్సు ఓనర్స్ సమావేశంపై జేసీ ప్రభాకర రెడ్డి మండిపడ్డారు. ఈ సమావేశానికి తమను ఆహ్వానించక పోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు తాము తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళమేనని.. తమను గద్వాల రాజులు అంటారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి లీజుకు ఇచ్చిన వాళ్లు బస్సులు ఎలా నడుపుతారో తాను చూస్తానంటూ హెచ్చరించారు.
ఇప్పటికీ హోస్పేట,బళ్ళారి, అనంతపురం జిల్లాలకు పర్మిట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్నప్రైవేట్ బస్సు ఓనర్స్పై నిప్పులు చెరిగారు. హైదరాబాదులో మీటింగ్ పెట్టుకున్న బస్సు ఓనర్స్ ఎవరికి బస్సులపై అవగాహన లేదన్నారు. మీ ఇష్టానుసారంగా బస్సు ఓనర్స్ సమావేశం ఏర్పాటు చేస్తే చూస్తూ ఊరుకోనని అన్నారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 20 , 2025 | 09:03 PM