పుష్ప కు ఐటీ షాక్..2000 కోట్లు లెక్కలు చెప్పాల్సిందే

ABN, Publish Date - Jan 21 , 2025 | 08:58 PM

ఐటీ శాఖ అధికారులు టాలీవుడ్‌లోని పలువురు దర్శక నిర్మాత నివాసాలపై దాడి చేశారు. సంక్రాంతి పండగ వేళ.. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ చిత్రాల బడ్జెట్‌పై ఆరా తీశారు. చెల్లించిన ఆదాయపు పన్నులకు, రాబడులకు మధ్య భారీ తేడా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వారు రంగంలోకి దిగారు.

ఐటీ శాఖ అధికారులు టాలీవుడ్‌లోని పలువురు దర్శక నిర్మాత నివాసాలపై దాడి చేశారు. సంక్రాంతి పండగ వేళ.. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ చిత్రాల బడ్జెట్‌పై ఆరా తీశారు. చెల్లించిన ఆదాయపు పన్నులకు, రాబడులకు మధ్య భారీ తేడా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వారు రంగంలోకి దిగారు. ఆ యా చిత్రాల నిర్మాణాలకు అయిన ఖర్చులు.. ఆదాయాలపై ఆరా తీశారు. అలాగే దిల్ రాజు భార్య తేజస్విని తీసుకొని ఐటీ అధికారులు బ్యాంకుకు వెళ్లారు. మంగళవారం.. టాలీవుడ్‌లోని పలువురి ప్రముఖుల నివాసాలపై ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఏక కాలంలో 8 చోట్ల సోదాలు చేపట్టారు. సంక్రాంతి పండగ వేళ వచ్చిన సినిమాలు కలెక్షన్ల తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ దాడులు చేశారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jan 21 , 2025 | 08:58 PM