ఏపీని హడలెత్తిస్తున్న జీబీఎస్..పిట్టల్లా రాలుతున్న జనం
ABN, Publish Date - Feb 17 , 2025 | 09:59 PM
జీబీఎస్ వైరస్ ఆంధ్రప్రదేశ్ను భయపెడుతోంది. జ్వరమే కదాని లైట్ తీసుకుంటే.. మీ ప్రాణాల మీదకు రావచ్చు. ఏపీలో ఎక్కడ చూసినా. ఇప్పుడు జీబీఎస్ పైనే చర్చ. అయితే ప్రభుత్వాలు, వైద్యులు డోంట్ వర్రీ అని అంటున్నాయి. మరి అలాంటి వేళ.. మరణించిన.. మరణిస్తున్న వారి పరిస్థితి ఏమిటనే ఓ చర్చ సైతం వాడి వేడిగా సాగుతోంది.
జీబీఎస్ వైరస్ ఆంధ్రప్రదేశ్ను భయపెడుతోంది. జ్వరమే కదాని లైట్ తీసుకుంటే.. మీ ప్రాణాల మీదకు రావచ్చు. ఏపీలో ఎక్కడ చూసినా. ఇప్పుడు జీబీఎస్ పైనే చర్చ. అయితే ప్రభుత్వాలు, వైద్యులు డోంట్ వర్రీ అని అంటున్నాయి. మరి అలాంటి వేళ.. మరణించిన.. మరణిస్తున్న వారి పరిస్థితి ఏమిటనే ఓ చర్చ సైతం వాడి వేడిగా సాగుతోంది.
రాష్ట్రంలో మొన్నటి వరకు కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో ఆరేళ్ల బాలుడు ఈ వ్యాధి బారిన పడి మరణించగా.. ఫిబ్రవరి 16న గుంటూరు జీజీహెచ్లోప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ అనే మహిళ మృతి చెందింది. దీంతో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పలు చోట్ల ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 17 , 2025 | 09:59 PM