తిరిగి వచ్చే సమయం ఆసన్నమైంది..
ABN, Publish Date - Jun 20 , 2025 | 08:04 AM
Balineni Srinivasa Reddy: వైసీపీలోని తన ముఖ్య అనుచరులు చేజారిపోతున్నా.. బాలినేని మాత్రం ఒంగోలువైపు చూడలేదు. ప్రస్తుతం హైదరాబాద్కు పరిమితమైన బాలినేని తాను తిరిగి ఇక్కడకు వచ్చే సమయం ఆసన్నమైందంటూ ఇటీవల ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
Prakasam District: మాజీ మంత్రి (Ex Minister) బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) ఒకప్పుడు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ (Congress), వైసీపీ రాజకీయాల్లో (YCP Politics) చక్రం తిప్పారు. గత ఎన్నికల్లో ఒంగోలు ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా ఓడిపోయిన తర్వాత జనసేనలో చేరారు. వైసీపీలో జరగబోయే పరిణామాలను ముందుగానే ఊహించి జాగ్రత్తపడ్డారంటారు. కానీ ఏడాదిగా నియోజకవర్గానికి దూరంగా ఉండడంతో అనుచరులందరూ డీలా పడ్డారు.
వైసీపీలోని తన ముఖ్య అనుచరులు చేజారిపోతున్నా.. బాలినేని మాత్రం ఒంగోలువైపు చూడలేదు. ప్రస్తుతం హైదరాబాద్కు పరిమితమైన బాలినేని తాను తిరిగి ఇక్కడకు వచ్చే సమయం ఆసన్నమైందంటూ ఇటీవల ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.
ఇవి కూడా చదవండి:
పిఠాపురం రోడ్డు ప్రమాద ఘటన బాధకలిగించింది: పవన్ కల్యాణ్
పుట్టిన రోజున మారిన రాహుల్ చిరునామా
For More AP News and Telugu News
Updated at - Jun 20 , 2025 | 08:04 AM