కుంభమేళాలో 15వేల మంది అదృశ్యం..? వేల మంది మృ*తి..?
ABN, Publish Date - Feb 04 , 2025 | 10:04 PM
జనవరి 29వ తేదీ మౌని అమావాస్య రోజు.. ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించగా.. మరో 60 మంది గాయపడ్డారు. ఇది యూపీలోకి యోగి ప్రభుత్వం చెప్పిన లెక్క. బారికేడ్ల ధ్వంసం కావడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున నష్ట పరిహారం కింద ప్రకటించింది. మౌని అమావాస్య పురస్కరించుకొని త్రివేణి సంగమంలో ఏడున్నర కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 04: జనవరి 29వ తేదీ మౌని అమావాస్య రోజు.. ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించగా.. మరో 60 మంది గాయపడ్డారు. ఇది యూపీలోకి యోగి ప్రభుత్వం చెప్పిన లెక్క. బారికేడ్ల ధ్వంసం కావడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున నష్ట పరిహారం కింద ప్రకటించింది. మౌని అమావాస్య పురస్కరించుకొని త్రివేణి సంగమంలో ఏడున్నర కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు.
ఫిబ్రవరి 3వ తేదీన వసంత పంచమి సందర్భంగా మూడు కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు. ఇక తొక్కిసలాటపై న్యాయ విచారణకు ఆదేశించింది యూపీ ప్రభుత్వం. అయితే ఈ తొక్కిసలాట ఘటన పార్లమెంట్ను కదిపేసింది. ఈ కుంభమేళకు కోట్లాది మంది భక్తులు వస్తారని తెలిసినా.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేదని విపక్షాలు మండిపడ్డాయి. ఈ తొక్కిసలాటలో మరణించింది 30 మంది కాదని.. వేలాది మంది అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 04 , 2025 | 10:04 PM