టీటీడీ ఈవోపై సీఎం చంద్రబాబు సీరియస్

ABN, Publish Date - Jan 09 , 2025 | 01:58 PM

తిరుపతి: తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ ఈవోపై సీరియస్ అయ్యారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, తొక్కిసలాట జరిగే ప్రమాదముందని తెలిసినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు.

తిరుపతి: తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ ఈవోపై సీరియస్ అయ్యారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, తొక్కిసలాట జరిగే ప్రమాదముందని తెలిసినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. అసలు టీటీడీ ఈవోకు సమాచారం ఎప్పుడు వచ్చిందని ప్రశ్నించారు. ‘మీ ప్లానింగ్ ఏంటి.. భక్తులు వస్తారని తెలిసి ప్లానింగ్ ఎందుకు చేయలేకపోయారని’ ముఖ్యమంత్రి నిలదీశారు. పోలీస్, టీటీడీ, రెవిన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం ఉందని నివేదిక వచ్చిందని, బాధ్యులను ఫిక్స్ చేసి వెంటనే వారిని సస్పెండ్ చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అసలు కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం ఎందుకు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ఘటనలో అధికారుల వైఫల్యం స్పష్టంగా ఉందని ప్రాథమిక నివేదిక వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

డాకు మహారాజ్ ఈవెంట్ రద్దు..

కేటీఆర్‌కు ఏసీబీ సూటి ప్రశ్నలు ఇవేనా..

సుప్రీంకోర్టులో సినీనటుడు మోహన్‌బాబుకు ఊరట

టీటీడీ జారీ చేసిన ఎస్డి టోకెన్స్ కోటా పూర్తి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 09 , 2025 | 01:58 PM