డాకు మహారాజ్ ఈవెంట్ రద్దు..

ABN, Publish Date - Jan 09 , 2025 | 01:40 PM

అనంతపురం: నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అనంతపురంలో నిర్వహించాలని బాలకృష్ణ, ఆ చిత్రం యూనిట్ భావించింది. అయితే తిరుపతిలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఈవెంట్ నిర్వహించకూడదని బాలకృష్ణ, సినిమా యూనిట్ క్యాన్సిల్ చేసింది.

అనంతపురం: నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అనంతపురంలో నిర్వహించాలని బాలకృష్ణ, ఆ చిత్రం యూనిట్ భావించింది. అయితే తిరుపతిలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఈవెంట్ నిర్వహించకూడదని బాలకృష్ణ, సినిమా యూనిట్ క్యాన్సిల్ చేసింది. మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా ఈవెంట్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రి కూడా తిరుపతి వెళ్లారు. దీంతో ప్రజలు, భక్తులు ఇబ్బందుల్లోఉన్నప్పుడు ఈ వేడుక జరపడం సరికాదని భావించి ఈవెంట్‌ను రద్దు చేశారని టీడీపీ నేత ఎంఎస్ రాజు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈవెంట్ రద్దయిన నేపథ్యంలో బాలయ్య అభిమానులు ఎవరూ రావద్దని ఎంఎస్ రాజు మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.


కాగా బుధవారం రాత్రి తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటన గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం అనంతపురంలో జరగాల్సిన 'డాకు మహారాజ్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. ఈ విషయాన్నీ 'డాకు మహారాజ్' టీమ్ అధికారికంగా తమ సోషల్ మీడియా ఎక్స్ ఖాతా తెలియజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేటీఆర్‌కు ఏసీబీ సూటి ప్రశ్నలు ఇవేనా..

సుప్రీంకోర్టులో సినీనటుడు మోహన్‌బాబుకు ఊరట

తొక్కిసలాటకు కారణం ఇదే.. భక్తుల ఆవేదన

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jan 09 , 2025 | 01:40 PM