సజ్జలకు నోటీసులు..అరెస్ట్‌కు రంగం సిద్ధం

ABN, Publish Date - Jun 10 , 2025 | 09:51 PM

రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి సమన్లు పంపిస్తామని ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజా స్పష్టం చేశారు.

రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి సమన్లు పంపిస్తామని ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజా స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కమిషన్ స్పష్టం చేసింది. సజ్జల వ్యాఖ్యలను నిరసిస్తూ.. రాజధాని ప్రాంత మహిళలు ర్యాలీగా మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలకు అమరావతి ప్రాంత మహిళలంటే చులకన అయిపోయిందన్నారు. గత ఐదేళ్లు కేసులో వేధించిన వైసీపీ ప్రభుత్వం .. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు గురవుతున్నారని పేర్కొన్నారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jun 10 , 2025 | 10:14 PM