బస్తా ఉల్లి కేవలం రూ.100లే..
ABN, Publish Date - Sep 22 , 2025 | 04:32 PM
కర్నూలు మార్కెట్ యాడ్లో 45 కేజీల ఉల్లిబస్తాను ప్రభుత్వం కేవలం రూ.100కే విక్రయించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల నుంచి మార్క్ ఫెడ్ ద్వారా క్వింటా ఉల్లి రూ.1,200కు ప్రభుత్వం కొనుగోలు చేసింది.
కర్నూలు: నగరంలోని మార్కెట్ యాడ్లో 45 కేజీల ఉల్లిబస్తాను ప్రభుత్వం కేవలం రూ.100కే విక్రయించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల నుంచి మార్క్ ఫెడ్ ద్వారా క్వింటా ఉల్లి రూ.1,200కు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రస్తుతం 1,900 టన్నుల ఉల్లి కర్నూలు మార్కెట్ యాడ్లో నిల్వ ఉంది. వేలం పాట ద్వారా వ్యాపారులు, హోటల్ నిర్వాహకులకు కొంత మేర అమ్మారు. మిగిలిన ఉల్లిని బస్తా కేవలం రూ.100కే ప్రభుత్వం విక్రయిస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News
Updated at - Sep 22 , 2025 | 04:32 PM