PSR ఆంజనేయులు కాదు.. YSR ఆంజనేయులు
ABN, Publish Date - May 20 , 2025 | 10:15 PM
రాష్ట్రంలో వైసీపీ నేతల అరెస్ట్ వ్యవహారంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అనుసరిస్తున్న వైఖరిని అమరావతి జేఏసీ నేత రామకోటయ్య నిశితంగా విమర్శించారు.
రాష్ట్రంలో వైసీపీ నేతల అరెస్ట్ వ్యవహారంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అనుసరిస్తున్న వైఖరిని అమరావతి జేఏసీ నేత రామకోటయ్య నిశితంగా విమర్శించారు. ఆ క్రమంలో టీడీప, జనసేన పార్టీలపైనే వైఎస్ జగన్ విమర్శిస్తున్నారని గుర్తు చేశారు. మరి బీజేపీని వైఎస్ జగన ఎందుకు విమర్శించడం లేదని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిందని.. అందులో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఉన్నాయని.. మరి వైసీపీ నేతల అరెస్ట్కు ఈ మూడు పార్టీలదే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. మరి రెండు పార్టీలపై విమర్శలు గుప్పించే వైఎస్ జగన్.. బీజేపీని ఎందుకు విమర్శించడం లేదని ఆయన ప్రశ్నించారు.
Updated at - May 20 , 2025 | 10:15 PM