ఓ మహిళా.. నీకు వందనం

ABN, Publish Date - Mar 08 , 2025 | 03:50 PM

Hardworking women: పిల్లలు చిన్నతనంలోనే భర్త ఆనారోగ్యంతో మృతి చెందగా.. వారిని పెంచి పోషించేందుకు ఓ మహిళ ఎంతో కష్టమైన పనిని ఎంచుకుంది. దాదాపు 68 సంవత్సరాలు ఆ పనిని చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది నాగమ్మ.

ఖమ్మం, మార్చి 8: జీవన సమరంలో అలుపెరుగని పోరాటం ఆమెది. కట్టుకున్న వాడు కాలం చేయడంతో కన్న బిడ్డల కోసం కఠినమైన కొలిమి పనులు చేస్తూ ముందుసాగుతోంది. 68 ఏళ్ల వయస్సు వచ్చినా రైతులకు వ్యవసాయంలో ఉపయోగించే ఇనుప వస్తువులను తయారు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె ఖమ్మం జిల్లా ఎన్కూర్ మండల కేంద్రానికి చెందిన కండ్రాతి నాగమ్మ. 68 ఏళ్ల వయస్సులో ఎవరైనా కృష్ణా రామా అనుకుంటూ ఓ మూలన కూర్చుని కాలక్షేపం చేస్తారు. కానీ ఖమ్మం జిల్లా ఎన్కూర్ మండల కేంద్రంలోని ఎన్‌ఏఎస్పీ కెనాల్ పక్కన ఉన్న చిన్న రేకుల షెడ్డులో ఎంతో కష్టమైన కొలిమి పనులు చూస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది నాగమ్మ.


ఈమెకు ఐదు దశాబ్దాల క్రితం వివాహం కాగా.. పిల్లలు చిన్నతనంలోనే భర్త అనారోగ్యంతో మరణించాడు. దీంతో ముగ్గురు పిల్లలను సాకేందుకు భర్త చేసిన కొలిమి పనులను ఆమె ధైర్యంగా చేపట్టింది. చాలీచాలని రాబడితో రైతులకు వ్యవసాయ పనిముట్లను తయారు చేస్తూ జీవనం సాగిస్తోంది.


ఇవి కూడా చదవండి...

seethakka International Womens Day: మహిళలను ఎదగనిద్దాం... మహిళలను గౌరవిద్దాం.

Insect in biryani: వామ్మో.. అసలు బిర్యానీ తినగలమా

Read Latest Telangana News And Telugu News

Updated at - Mar 08 , 2025 | 03:50 PM