Share News

Engineering Entrance Exam: నేటి నుంచి ఎప్‌సెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్షలు

ABN , Publish Date - May 02 , 2025 | 07:53 AM

తెలంగాణ ఎప్‌సెట్‌-2025 ఇంజనీరింగ్‌ పరీక్షలు మే 1 నుండి ప్రారంభమవుతున్నాయి. రోజూ రెండు సెషన్లలో నిర్వహించబోతున్న ఈ పరీక్షలకు 124 కేంద్రాలు ఏర్పాటుచేశారు.

Engineering Entrance Exam: నేటి నుంచి ఎప్‌సెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్షలు

  • 4 వరకు రోజూ రెండు సెషన్లలో నిర్వహణ

  • 2,20,371 మంది కోసం 124 పరీక్ష కేంద్రాలు

  • నిమిషం లేటైనా పరీక్ష కేంద్రంలోకి నో ఎంట్రీ

హైదరాబాద్‌ సిటీ, మే 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఎప్‌సెట్‌-2025 ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆదివారం వరకు రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి సెషన్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి సెషన్‌కు 90 నిమిషాల ముందుగానే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని, పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం లేటైనా లోనికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ పరీక్షల కోసం 124 కేంద్రాలను ఏర్పాటు చేయగా, 2,20,371 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. మే 15లోగా ఎప్‌సెట్‌ ఇంజనీరింగ్‌ ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Updated Date - May 02 , 2025 | 07:53 AM