Alcohol Prices: మందుబాబులకు షాక్!
ABN , Publish Date - May 19 , 2025 | 03:59 AM
మందుబాబులకు ప్రభుత్వం షాకిచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచింది. క్వార్టర్కు రూ.10, హాఫ్కు రూ.20, ఫుల్బాటిల్కు రూ.40 చొప్పున ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం.. క్వార్టర్కు రూ.10, ఫుల్బాటిల్కు రూ.40 పెంపు
ఆదివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి.. సర్కారుకు నెలకు రూ.160 కోట్ల అదనపు ఆదాయం
చీప్లిక్కర్, బ్రీజర్కు పెంపు నుంచి మినహాయింపు.. ఫిబ్రవరిలో బీర్ల ధరలు పెంచిన సర్కారు
హైదరాబాద్, మే 18 (ఆంధ్రజ్యోతి): మందుబాబులకు ప్రభుత్వం షాకిచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచింది. క్వార్టర్కు రూ.10, హాఫ్కు రూ.20, ఫుల్బాటిల్కు రూ.40 చొప్పున ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరల పెంపు వల్ల ప్రభుత్వానికి నెలకు రూ.160 కోట్ల మేర అదనపు ఆదాయం లభించనుంది. కాగా, క్వార్టర్ రూ.110కి అమ్ముతున్న చీప్లిక్కర్ ధరను మాత్రం పెంచలేదు. ఎక్కువ మంది పేదలు తాగే మద్యంగా దీనికి గుర్తింపు ఉంది. అదే సమయంలో తక్కువ ఆల్కహాల్ శాతం ఉండే బ్రీజర్ ధరలను కూడా పెంచలేదు. ఈ రెండు మినహా మిగతా అన్ని బ్రాండ్ల మద్యం ధరలనూ పెంచారు.
పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. వాస్తవానికి 2023 మే నెలలో మద్యం ధరలను క్వార్టర్కు రూ.20 పెంచారు. అయితే మళ్లీ రెండు రోజుల్లోపే ఆ పెంపును రూ.10కి పరిమితం చేశారు. మద్యం ధరలు పెంచితే అమ్మకాలు పడిపోతాయంటూ డిస్టిలరీలు చేసిన విజ్ఞప్తి మేరకు ధర తగ్గిన్తున్నట్లు అప్పట్లో అధికారులు చెప్పారు. అప్పుడు తగ్గించిన రూ.10నే ఇప్పుడు పెంచామని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ పెంపు ద్వారా వచ్చే మొత్తం ప్రభుత్వానికి మాత్రమే వస్తుంది. తయారీదారులకు దీంతో ఏమాత్రం సంబంధం లేదు. కాగా, బీర్ల ధరలను ఈ ఫిబ్రవరిలోనే ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. బీర్ల ధరల పెంపు సమయంలో మాత్రం అటు తయారీదారులకు కొంత ధర పెంచి, దానిపై మళ్లీ ప్రభుత్వం కూడా పన్నులు విధించి ధరలు పెంచింది.
ఈ వార్తలు కూడా చదవండి
Coin Temple: ఈ అమ్మ వారికి మొక్కుల కింద ఏం చెల్లిస్తారో తెలుసా..
Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్.. పీఎస్ ఎదుట అతడి భార్య ఆందోళన
Fire Accident: పోస్ట్మార్టం పూర్తి.. మృతదేహాలు బంధువులకు అప్పగింత
For Telangana News And Telugu News