సరస్వతి నది పుష్కరాల కోసం ప్రత్యేకాధికారులు
ABN , Publish Date - May 10 , 2025 | 05:15 AM
జయశంకర్ భూపాలపల్లిజిల్లా పరిధిలో ఈ నెల 15 నుంచి 31 వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ తరఫున ప్రత్యేకాధికారులను నియమించారు.

హైదరాబాద్, మే 9 (ఆంధ్రజ్యోతి): జయశంకర్ భూపాలపల్లిజిల్లా పరిధిలో ఈ నెల 15 నుంచి 31 వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ తరఫున ప్రత్యేకాధికారులను నియమించారు.
ఆ శాఖ మంత్రి సీతక్క ఆదేశం మేరకు పీఆర్ డైరెక్టర్ సృజన శుక్రవారం ప్రొసీడింగ్స్ జారీ చేశారు. పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, ములుగు, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలకు చెందిన నలుగురు డీపీవోలు, నలుగురు డీఎల్పీవోలు, 14 మంది ఎంపీడీవోలు, 28 మంది ఎంపీవోలు ప్రత్యేకాధికారుల విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB
PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..
Read Latest Telangana News And Telugu News