ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా: సూరేపల్లి సుజాత
ABN , Publish Date - May 09 , 2025 | 03:12 AM
ఫేస్బుక్లో తాను పోస్ట్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని శాతవాహన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
గణేశ్నగర్(కరీంనగర్), మే 8 (ఆంధ్రజ్యోతి): ఫేస్బుక్లో తాను పోస్ట్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని శాతవాహన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తన వ్యాఖ్యలు ఎవరినీ, ఏ మతాన్ని, సందర్భాన్ని ఉద్దేశించినవి కావని, అవి ఎవరైనా బాఽధించినా, మనోభావాలు దెబ్బతీసినా క్షమించాలని ఆమె కోరారు.
ఒక పరిశోధకురాలుగా యుద్ధం అంటే భయంతో, అందులో మరణించే పసిపిల్లలు గుర్తుకు వచ్చి మాత్రమే ఆ పోస్ట్ చేశానన్నారు. దేశ భద్రత, సైన్యం, ప్రభుత్యంపై ఎటువంటి అగౌరవంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. తాను బాధ్యత కలిగిన పౌరురాలినని, దేశభక్తితోనే స్పందించానని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నూతన మేయర్గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక
హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
For More AP News and Telugu News