Duddilla Sridhar Babu: బ్రాహ్మణుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
ABN , Publish Date - Jul 31 , 2025 | 04:58 AM
బ్రాహ్మణుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు
హైదరాబాద్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): బ్రాహ్మణుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అభివృద్ధికి ఇప్పటికే రూ. 25 కోట్లు కేటాయించామని, భవిష్యత్తులో మరిన్ని నిధులు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గౌలిదొడ్డిలోని బ్రాహ్మణ సదనంలో సెంటర్ ఫర్ బ్రాహ్మిణ్ ఎక్సలెన్స్ (సీబీఈ) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. బ్రాహ్మణుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. సమాజ సేవతోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని, ప్రజల సమస్యలను పరిష్కరించడం తనకు ఎల్లప్పుడూ ఆనందాన్నిస్తుందని మంత్రి అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్
ఈ ఆకును నాన్ వేజ్తో కలిపి వండుకుని తింటే ..
For More International News And Telugu News