Share News

Mulugu: గ్రామసభలో పురుగుల మందు తాగి.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతి

ABN , Publish Date - Feb 07 , 2025 | 04:47 AM

ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో జనవరి 23న జరిగిన ప్రజాపాలన గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన కుమ్మరి నాగేశ్వర్‌రావు(42) బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు.

Mulugu: గ్రామసభలో పురుగుల మందు తాగి.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతి

  • కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటాం: మంత్రి సీతక్క

ములుగు/కన్నాయిగూడెం, ఫిబ్రవరి6(ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో జనవరి 23న జరిగిన ప్రజాపాలన గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన కుమ్మరి నాగేశ్వర్‌రావు(42) బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేకపోవడంతో అధికారులను నిలదీసిన నాగేశ్వర్‌ రావు.. అధికారులు వివరణ ఇస్తుండగానే తీవ్ర మనస్తాపానికి గురై పురుగు మందు తాగిన విషయం విదితమే. ఘటన జరిగిన రోజు నుంచి హనుమకొండ జిల్లా ఆరెపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆరోగ్యం విషమించి అర్ధరాత్రి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ వేణుగోపాల్‌ గురువారం అంత్యక్రియల నిమిత్తం రూ.50 వేలను కుటుంబ సభ్యులకు అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించిన కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.


నాగేశ్వర్‌రావుకు భార్య శాంతి, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వైద్యానికి ఇప్పటి వరకు రూ.8.50 లక్షల వరకు ఖర్చయిందని, తాము సొంతంగా రూ.3.50 లక్షలు సమకూర్చుకోగా మిగతా మొత్తాన్ని రాజకీయ నాయకులు, సన్నిహితులు సాయంగా అందించారని నాగేశ్వర్‌రావు పెద్దకుమార్తె శాలిని తెలిపింది. తమ కుటుంబంలో ఒకరికి ప్రభు త్వ ఉద్యోగంతోపాటు ఇల్లును మంజూరు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరింది. కాగా, నాగేశ్వర్‌రావు మృతి పట్ల మంత్రి సీతక్క ఓ ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. నాగేశ్వర్‌రావుకు మెరుగైన వైద్యం అందించేలా చొరవ తీసుకుంటూనే ఉన్నామని, కానీ ఎంజీఎం ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందని కాంగ్రెస్‌ నేతలను మంత్రి ప్రశ్నించారు. మరోవైపు.. నాగేశ్వనరావుది ప్రభుత్వ హత్యేనని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు ఆరోపించారు. రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి:


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 07 , 2025 | 04:47 AM