DK Aruna : కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఎంపీ డీకే అరుణ సెటైర్లు
ABN , Publish Date - Sep 02 , 2025 | 02:36 PM
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని స్వయంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే ఒప్పుకుంటుందని చెప్పిన డీకే అరుణ.. ' డైలాగ్స్ వద్దు.. దోషులు మీరే. కానీ.. కేసీఆర్ కు సంబంధం లేదంట.. ఇదెక్కడి చోద్యం. ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు ఏలింది వాళ్ళ కుటుంబమే కదా.'
మహబూబ్ నగర్, సెప్టెంబరు 2 : కాళేశ్వరం అవినీతిని బయటకు తీయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని తెలంగాణ బీజేపీ ఎంపీ DK అరుణ విమర్శించారు. ఆ పార్టీ వ్యవహారం చూస్తుంటే.. అవినీతికి పాల్పడిన వాళ్లను కాపడుతున్నట్లే ఉందన్నారు. మహబూబ్ నగర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో అరుణ మీడియాతో మాట్లాడారు 'కాళేశ్వరం విషయంలో మేము ముందే సీబీఐ ఎంక్వయిరీ అంటే ఉలకలేదు, పలకలేదు. మీరు వేసిన కమిషన్ నివేదికలో ఏం తెల్చారు.. ఎవరిని దోషులుగా చూపారో ఎందుకు బయట పెట్టలేదు.? అంతన్నారు, ఇంతన్నారు.. చేసేదేమి లేక CBI ఎంక్వయిరీ అంటున్నారు. ఇదంతా BRS కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం లా కనిపిస్తోంది. దొంగలు దొంగలు కలిసి గుట్టలు పంచుకున్నట్లు ఉన్నది.' అంటూ అరుణ రేవంత్ సర్కారుని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని స్వయంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే ఒప్పుకుంటుందని చెప్పిన డీకే అరుణ.. ' డైలాగ్స్ వద్దు.. దోషులు మీరే. కానీ.. కేసీఆర్ కు సంబంధం లేదంట.. ఇదెక్కడి చోద్యం. ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు ఏలింది వాళ్ళ కుటుంబమే కదా. BRS లో ఉన్న కేసీఆర్ ఫ్యామిలీ మొత్తానికి కాళేశ్వరం అవినీతిలో సంబంధం ఉన్నది' ఇది ఎవ్వరు కాదనలేని నిజం అంటూ అరుణ వ్యాఖ్యలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చంద్రబాబు ది గ్రేట్.. సీబీఎన్ కు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అభినందనలు
250 కోట్ల మంది అకౌంట్లు ప్రమాదంలో.. జీమెయిల్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక..
For More AP News And Telugu News