Share News

Cheap Liquor: ప్రాణం తీసిన చీప్‌ లిక్కర్‌ !

ABN , Publish Date - Feb 12 , 2025 | 05:48 AM

ఈ ఘట న మంగళవారం సాయంత్రం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగింది. గద్వాల మండల పరిధిలోని చెనుగోనిపల్లి గ్రామానికి చెందిన దినసరి కూలీ దౌలత్‌పీర్‌ (50) మంగళవారం గద్వా ల కొత్త బస్టాండ్‌ ఎదురుగా ఉన్న వరలక్ష్మి వైన్‌షాపులో చీప్‌ లిక్కర్‌ (డీకే బ్రాండ్‌) క్వార్టర్‌ బాటిల్‌ను కొనుగోలు చేశాడు.

Cheap Liquor: ప్రాణం తీసిన చీప్‌ లిక్కర్‌ !

మద్యం సేవిస్తూ దినసరి కూలీ మృతి

గద్వాల క్రైం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): వైన్‌ షాపు పర్మిట్‌ రూమ్‌లో చీప్‌ లిక్కర్‌ తాగుతూ ఓ దినసరి కూలీ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘట న మంగళవారం సాయంత్రం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగింది. గద్వాల మండల పరిధిలోని చెనుగోనిపల్లి గ్రామానికి చెందిన దినసరి కూలీ దౌలత్‌పీర్‌ (50) మంగళవారం గద్వా ల కొత్త బస్టాండ్‌ ఎదురుగా ఉన్న వరలక్ష్మి వైన్‌షాపులో చీప్‌ లిక్కర్‌ (డీకే బ్రాండ్‌) క్వార్టర్‌ బాటిల్‌ను కొనుగోలు చేశాడు. పర్మిట్‌రూమ్‌లోకి వెళ్లి తాగుతూ కిందపడి కాళ్లు, చేతులు కొట్టుకుంటూ మృతి చెందాడు. పోలీసులు మద్యం నమూనాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుడి భార్య అన్ను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాగా, కూలీ దౌలత్‌పీర్‌ మరణానికి కల్తీ మద్యమే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో కొందరు నకిలీ మద్యం తయారు చేసి దుకాణాలకు సరఫరా చేసిన ఘటనలు గతంలో వెలుగుచూశాయి. కే.టీ.దొడ్డి మండల పరిధిలోని పాతపాలెం గ్రామానికి చెందిన కొందరు నకిలీ మద్యం తయారు చేసిన ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రభుత్వానికి రుణ మంజూరు పత్రాలు అందజేసిన హడ్కో ప్రతినిధులు

Also Read: కేటీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే..

Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం

Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి

Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు

Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు

For National News And Telugu News

Updated Date - Feb 12 , 2025 | 05:48 AM