Share News

Konda Surekha Vs KTR: కేటీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే..

ABN , Publish Date - Feb 11 , 2025 | 06:59 PM

Konda Surekha Vs KTR: కులగణన సర్వే రీ సర్వే చేయాలంటూ రేవంత్ రెడ్డి సర్కార్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి కొండా సురేఖ స్పందించారు.

Konda Surekha Vs KTR: కేటీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే..

హైదరాబాద్, ఫిబ్రవరి 11: సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే మళ్లీ నిర్వహించాలంటే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే‌ మళ్లీ నిర్వహించాలంటూ కేటీఆర్.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ మంగళవారం హైదరాబాద్‌లో కౌంటర్ ఇచ్చారు. రీ సర్వే అని కేటీఆర్ అంటున్నారని.. అయితే ఆయన తన చెల్లి కల్వకుంట్ల కవితను చూసి నేర్చుకోవాలని సూచించారు.

ఈ సర్వే, ప్రొఫార్మా లో ఎక్కడ తప్పులు జరిగాయో చెప్పాలంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ను డిమాండ్ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలలో అసంతృప్తి అనేది తనకు తెలీదన్నారు. అలా అని తాను ఎవరిని ఎంకరేజ్ చేయడం లేదన్నారు. అయితే దేవాదాయ శాఖలో ఉద్యోగుల కొరత ఉందని.. అడ్మినిస్ట్రేషన్‌కు ఇబ్బంది అవుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ నుంచి ఉద్యోగులను తీసుకోవడం ఇప్పుడు కొత్తేమీ కాదని చెప్పారు.


లీగల్ లిటికేషన్స్ లేని వాటిని మొదటి దశలో సర్వే చేయాలని అదేశించామని ఆమె వివరించారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ కుంభాబిషేకాలు చేయాలో లిస్ట్ తియ్యాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కాళేశ్వరంలో కుంభాభిషేకం చేయక 42 ఏళ్లు అవుతుందని గుర్తు చేశారు. ఫారెస్ట్‌లో సర్వేయర్ల ప్రొటెక్షన్‌పై ఎలాంటి ఫిర్యాదులు లేవని తెలిపారు.

Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం

Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు


గత పదేళ్ళలో దేవాదాయ శాఖ భూములు కబ్జా అయ్యాయని వివరించారు. అందులో గత ప్రభుత్వంలోని నేతలు అధికంగా ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. ఇక మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్‌పై త్వరలో విచారణ జరుగుతుందని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల సర్వే‌తో తమకు పేరు వస్తుందని బీఆర్ఎస్ పార్టీ తమను లక్ష్యంగా చేసుకొందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల వ్యాల్యూ ఇప్పుడే అర్థం కాదన్నారు. ఉద్యోగాలు, ఇతర అంశాల్లో బీసీలకు తీవ్ర న్యాయం జరుగుతుందని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి

Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్


రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల కుల గణన సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో తెలంగాణలో బీసీల శాతం కొద్దిగా తగ్గినట్లు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో 2014లో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహించిందని ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. ఆ సమయంలో 51 శాతానికి పైగా బీసీలు ఉన్నాని గుర్తు చేశారు.

Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు


కానీ కాంగ్రెస్ పార్టీ జరిపిన ఈ సర్వేలో బీసీల శాతం దాదాపు 5 శాతానికిపైగా తగ్గడం పట్లు కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కులగణన సర్వే మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అలాంటి వేళ.. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ పైవిధంగా కౌంటర్ ఇచ్చారు.

For Telangana News And Telugu News

Updated Date - Feb 11 , 2025 | 07:00 PM