Share News

HUDCO: ప్రభుత్వానికి రుణ మంజూరు పత్రాలు అందజేసిన హడ్కో ప్రతినిధులు

ABN , Publish Date - Feb 11 , 2025 | 08:01 PM

HUDCO: 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. ఏపీకి మూడు రాజధానులంటూ ఆయన అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. దీంతో రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళనకు దిగారు. నాటి నుంచి 2024 అసెంబ్లీ నాటి వరకు ఈ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.

HUDCO: ప్రభుత్వానికి రుణ మంజూరు పత్రాలు అందజేసిన హడ్కో ప్రతినిధులు

అమరావతి, ఫిబ్రవరి 11: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హడ్కో) రుణం మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన మంజూరు పత్రాలను ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్ కె.కన్నబాబుకు హడ్కో ప్రతినిధులు అందజేశారు. మంగళవారం విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో కమిషనర్ కన్నబాబుకు హడ్కో జాయింట్ జనరల్ మేనేజర్(లా) ఎస్.ఎం. శ్రీనివాస్, జాయింట్ జనరల్ మేనేజర్(ప్రాజెక్ట్స్) కె. విజయ్ కుమార్ అందజేశారు.

నేటి నుంచి నాలుగు మాసాలలో ఈ లోన్ అగ్రిమెంట్ వ్యవహారాలను పూర్తి చేసుకోవాలని ఈ సందర్భంగా కమిషనర్‌ కన్నబాబును హడ్కో ప్రతినిధులు కోరారు. అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్ల రుణాన్ని హడ్కో అందజేస్తున్న సంగతి తెలిసిందే. రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు గతంలో ముంబైలో నిర్వహించిన పాలకమండలి సమావేశంలో హడ్కో ఆమోదించిన విషయం విధితమే.

కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనులు ఊపుందుకొన్నాయి. అయితే రాజధాని నిర్మాణానికి రుణం కోసం హడ్కోను ప్రభుత్వం సంప్రదించింది. ఆ క్రమంలో హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్టితో మంత్రి నారాయణ గతేడాది అక్టోబర్‌లో సమావేశమై చర్చించారు.


హడ్కో నుంచి రుణం విడుదలకు ఏపీ ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, నిధుల వినియోగం తీరు తెన్నులను మంత్రి నారాయణ హడ్కో సీఎండీకి సోదాహరణగా వివరించారు. అనంతరం రాజధాని నిర్మాణానికి నిధుల విడుదల చేయాలని ముంబైలో జరిగిన హడ్కో సమావేశంలో నిర్ణయించారు. దీంతో రుణాల మంజూరు పత్రాలను సీఆర్‌డీఏ కమిషనర్‌కు హడ్కో ప్రతినిధులు అందజేశారు.

Also Read: కేటీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే..


అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. ఏపీకి మూడు రాజధానులంటూ ఆయన అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. దీంతో రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఆందోళనకు దిగారు. నాటి నుంచి 2024 అసెంబ్లీ నాటి వరకు ఈ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ప్రతిపక్ష నేతగా ఇదే వైఎస్ జగన్ రాజధాని అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చి మాట మార్చి మడం తిప్పడంతో.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఓటర్లు కట్టబెట్టారు.

Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం


ఇక చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం రాజధాని అమరావతితోపాటు రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సహాయ సహకారాలు కోరింది. దీంతో మళ్లీ ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతమైంది. మరోవైపు రాజధాని నిర్మాణానికి హడ్కో నుంచి రుణం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ ప్రయత్నాలు సైతం సఫలమైనాయి.

Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి

Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు

Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 11 , 2025 | 08:01 PM