10వ తేదీలోపు డబుల్బెడ్రూం ఇండ్లు అందజేస్తాం
ABN , Publish Date - May 28 , 2025 | 12:07 AM
డబుల్ బెడ్రూం ఇండ్లను వచ్చే నెల 10వ తేదీలోపు లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకొంటున్నామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. పట్టణంలోని చందపల్లి, రాంపల్లిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాన్ని మంగళవారం కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పరిశీలించారు.
పెద్దపల్లిటౌన్, మే 27 (ఆంధ్రజ్యోతి): డబుల్ బెడ్రూం ఇండ్లను వచ్చే నెల 10వ తేదీలోపు లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకొంటున్నామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. పట్టణంలోని చందపల్లి, రాంపల్లిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాన్ని మంగళవారం కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ సముదాయం వద్ద ప్రజా ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్డు, తాగునీరు, విద్యుత్ సరఫరా, డైన్రేజీ వ్యవస్థ పనులు పూర్తి చేశా మన్నారు.
పెండింగ్లో ఉన్న చిన్న చిన్న పనులను పూర్తి చేసి ఎంపికైన లబ్ధిదారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 నాడు అప్పగిస్తామని పూర్తిస్థాయిలో 10న అందజేయనున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగించి శుభ్రం చేయించాలని, ఓనర్ పేరు మీద విద్యుత్ మీటర్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. జూన్ 10వ తేదీలోపు మంత్రి చేతులమీ దుగా లబ్ధిదారుల గృహ ప్రవేశం చేయించేందుకు అవ సరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ వెంక టేష్, మార్కెట్ చైర్పర్సన్ ఈర్ల స్వరూప, అధికారులు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, కాంట్రా క్టర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.