యాప్ ద్వారా యూరియా కొనుగోలు సులభతరం
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:11 AM
యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయడం సులభతర మని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శనివారం పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద ఎరువుల దుకాణాన్ని సందర్శించారు. యూరియా బుకింగ్ యాప్ గురించి తెలుసుకున్నారు.
పెద్దపల్లి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయడం సులభతర మని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శనివారం పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద ఎరువుల దుకాణాన్ని సందర్శించారు. యూరియా బుకింగ్ యాప్ గురించి తెలుసుకున్నారు. అలాగే పలువురు రైతులకు యూరియా బుకింగ్ గురించి వివరించారు. ఆయన మాట్లాడుతూ యూరియా లభ్యతపై రైతు లకు ఎటువంటి అనుమానాలు అవసరం లేదని, ప్రతీ రైతుకు అవసరమైన మేర యూరియా అందు బాటులో ఉందని తెలిపారు. ప్రతీరైతుకు యూరియా అందాలనే జిల్లాలో యూరియా ట్రాకింగ్ యాప్ సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు. నెల రోజుల నుంచి యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు జిల్లాలో పర్యవేక్షించామని తెలిపారు. మనం అనుసరించిన విధానాన్ని పరిశీలించిన ప్రభుత్వం మరింత మెరుగ్గా యూరియా బుకింగ్ యాప్ ప్రవేశపెట్టిందన్నారు. ఓలా, ఊబర్ వంటి యాప్లలో టాక్సీ ఎలా బుక్ చేస్తామో, అదేవిధంగా సులభంగా ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. రైతులు తమ ఇంటి వద్ద నుంచి యూరియా బుక్ చేసుకుని ఎరువుల షాప్నకు స్వయంగా లేదా ఇతరులతో బుక్ చేసుకున్న బస్తాల వివరాలు, ఓటీపీ చెప్తే షాప్ యజమానులు యూరి యా సరఫరా చేస్తారని, ఈ యాప్ ఉపయోగించడం వల్ల రైతులు నేరుగా వచ్చి యూరియా తీసుకువెళ్లవచ్చన్నారు. యాప్ విధానం ద్వారా రైతులు అవసరా నికి మించి యూరియా తీసుకొని వెళ్లి స్టాక్ పెట్టుకోవడం నియం త్రించవచ్చని, చిన్న,సన్న కారు రైతులకు యూరియా కొరత రాకుండా ఉంటుందని తెలిపారు. రైతుల భూమి వివరాలు, ఎంత యూరియా అవసరం, ఇంకా ఎన్ని కావాలో అనే అంశాలు యాప్లో నమోదవుతాయని కలెక్టర్ తెలిపారు. రైతులు యాప్ ఉపయోగించుకొని యూరియా కొనుగోలు చేయాల న్నారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఏఓలు పాల్గొన్నారు.