సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటాలు
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:27 AM
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాలు చేయాలని సీఐటీయూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీపెల్లి రవీందర్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో కునమల్ల అధ్యక్షతన గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్క్ యూనియన్ సీఐటీయూ 4వమహాసభ నిర్వహించారు.
ధర్మారం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాలు చేయాలని సీఐటీయూ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీపెల్లి రవీందర్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో కునమల్ల అధ్యక్షతన గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్క్ యూనియన్ సీఐటీయూ 4వమహాసభ నిర్వహించారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమ స్యల పై రాజీలేని పోరాటాలు చేయాలన్నారు.
మండల కమిటీని ఎన్ను కున్నారు. గౌరవ అధ్యక్షుడిగా కునమల్ల అశోక్, మండల అధ్యక్షుడిగా శాతరాజుల గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా ఏదుల్ల రవి కుమార్, కోశాధికారిగా గొల్లపల్లి రమేష్గౌడ్, ఉపాధ్యక్షులుగా రాగుల మల్లేష్, కన్నా కరుణాకర్, శనిగరపు లచ్చయ్య, సహాయ కార్య దర్శులుగా నెల్లి కుమార్, జూపాక ప్రశాంత్, యశోద కృష్ణ, కమిటీ సభ్యులుగా వడుకాపురం శ్రీనివాస్, రాజు, శంకరయ్య, సంఘ రాజేశం, రాజేందర్, సురేష్నాయక్, మల్లయ్య, బిరుదు శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
)ః