ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం
ABN , Publish Date - Jul 04 , 2025 | 11:51 PM
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని రామగుండం ఎంవీఐ సంతోష్రెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ నాగభూషణం అన్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను దర్శించుకోవడానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేసి ఏసీ, నాన్ ఏసీ బస్సులను నడప డం హర్షనీయమన్నారు.
కళ్యాణ్నగర్, జూలై 4(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని రామగుండం ఎంవీఐ సంతోష్రెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ నాగభూషణం అన్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను దర్శించుకోవడానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేసి ఏసీ, నాన్ ఏసీ బస్సులను నడప డం హర్షనీయమన్నారు. ఆషాఢమాసం సంద ర్భంగా గోదావరిఖని బస్టాండ్ నుంచి భక్తుల కోసం యాత్ర ప్యాకేజీల వాల్ పోస్టర్లను ఆవి ష్కరించారు. ఈ నెల 8న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, జోగులాంబకు రాజ ధాని ఏసీ సర్వీస్, పెద్దలకు రూ.5900, పిల్లలకు రూ.4900గా పేర్కొన్నారు. ఈనెల 14న శ్రీశైలం, యాగంటి, అహోబిలంకు సూపర్ లగ్జరీ సర్వీస్ నడుపుతామని, పెద్దల కు రూ.3,300, పిల్లలకు రూ.2500 చార్జీగా పేర్కొన్నారు. 21న వర్గల్, చిలుకూరి బాలాజీ, ముంచింతల్కు సూపర్ లగ్జరీ బస్సు వెళుతుందని, పెద్దలకు రూ.1430, పిల్లలకు రూ.1150 చార్జి, 27న అన్నవరం, సింహాచలం, అమరావతి, మం గళగిరి, విజయవాడకు సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేశామని, పెద్దలకు రూ.3470, పిల్లల కు రూ.2700చార్జీగా నిర్ణయించినట్టు డీఎం తెలిపారు. యాత్రలే కాకుండా 30 మందికన్నా ఎక్కువ ఉంటే కోరిన చోటికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్న ట్టు వారు తెలిపారు. వివరాలకు 7013504982, 7989847927, 7382847596సెల్ నెంబర్లలో సంప్రదించాలని కోరారు. ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.