మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:21 AM
జీఎస్టీ తగ్గింపుపై మార్కండేయ కాలనీలో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బీజేపీ రామగుండం ఇన్చార్జి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలు సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ, వ్యాపార వర్గాలకు ఊరటనిస్తున్నాయన్నారు.
గోదావరిఖని, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): జీఎస్టీ తగ్గింపుపై మార్కండేయ కాలనీలో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బీజేపీ రామగుండం ఇన్చార్జి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలు సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ, వ్యాపార వర్గాలకు ఊరటనిస్తున్నాయన్నారు. ఊరగొండ అపర్ణ, మెరుగు శ్రీనివాస్, అందె రాజ్కుమార్ చారి, కందుల పోచం, జక్కన బాలు, సమ్మయ్య, రాజలక్ష్మి, సిలారపు కళ్యాణ్, వంశీ, సాయి, కృష్ణ, శివ, కర్నాకర్, దివ్యా, స్వాన్సి, ప్రిన్సి, భాగ్య, వరలక్ష్మిపాల్గొన్నారు.
మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం
సుల్తానాబాద్, సెప్టెంబరు5(ఆంధ్రజ్యోతి): వస్తువులపై జీఎస్టీ తగ్గించడాన్ని హర్షిస్తూ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల కోసం పలు నిత్యావసర వస్తువులు, వ్యవసాయ పనిముట్లపై జీఎస్టీ తగ్గించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సీనియర్ నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్ రావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వమన్నారు. నాయకులు సౌదరి మహేందర్ యాదవ్, కొమ్ము తిరుపతి, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, లంక శంకర్, కామని రాజేంద్రప్రసాద్, చాతరాజు రమేష్, ఎల్లెంకి రాజు, ఏగోలపు శ్రీనివాస్, కొల్లూరి సంతోష్ కుమార్, ఊషన అన్వేష్, గుడ్ల వెంకటేష్, గజబీంకార్ పవన్, మల్క భాగ్యలక్ష్మి, మాటూరి లత పాల్గొన్నారు.