పంటల మద్దతు ధర పెంపుపై హర్షం
ABN , Publish Date - May 29 , 2025 | 11:21 PM
వివిధ రకాల పంటలకు కనీస మద్దతు ధర పెం చడాన్ని స్వాగతిస్తూ బీజేపీ ఆధ్వ ర్యంలో గురువారం జెండా చౌరస్తాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రప టానికి క్షీరాభిషేకం చేశారు. కొన్ని పంటలకు మద్దతు ధర గణనీ యంగా పెరిగిందన్నారు.
పెద్దపల్లిటౌన్, మే 29 (ఆంధ్రజ్యోతి): వివిధ రకాల పంటలకు కనీస మద్దతు ధర పెం చడాన్ని స్వాగతిస్తూ బీజేపీ ఆధ్వ ర్యంలో గురువారం జెండా చౌరస్తాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రప టానికి క్షీరాభిషేకం చేశారు. నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో 2025-26 సంవత్సరానికి ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను పెంచిందన్నారు.
కొన్ని పంటలకు మద్దతు ధర గణనీ యంగా పెరిగిందన్నారు. రైతులకు రుణాలపై వడ్డీ రాయితీ కూడా ఇవ్వనున్నారని తెలిపారు. పట్టణ అధ్యక్షుడు పెంజర్ల రాకేష్ మండల అధ్యక్షుడు వేల్పుల రమేష్, నాయకులు తంగేడా రాజేశ్వరరావు, పోల్సని సంపత్ రావు, కావేటి రాజగోపాల్, మేకల శ్రీనివాస్, ఈర్ల శంకర్, గాదాసి సతీష్, సంపత్, మధు, అంజి, కార్యకర్తలు పాల్గొన్నారు.