Share News

Handloom Workers: జియో ట్యాగ్‌ కార్మికులందరికీ భరోసా ఇవ్వాలి

ABN , Publish Date - Jul 31 , 2025 | 05:21 AM

రాష్ట్రంలో జియో ట్యాగ్‌ఉన్న చేనేత కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా చేనేత భరోసా ఇవ్వడంతో పాటు

Handloom Workers: జియో ట్యాగ్‌  కార్మికులందరికీ భరోసా ఇవ్వాలి

  • చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీధర్‌

హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జియో ట్యాగ్‌ఉన్న చేనేత కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా చేనేత భరోసా ఇవ్వడంతో పాటు లక్ష రూపాయల రుణమాఫీ తక్షణం అమలుచేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు చేనేత జౌళి శాఖ అదనపు సంచాలకులు శ్రీనివాస్‌ రెడ్డికి చేనేత కార్మిక సంఘం ప్రతినిధులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. చేనేతవృత్తి రక్షణ, వృత్తిదారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత భరోసా పథకం ద్వారా జియో ట్యాగ్‌ వేసిన ప్రతి మగ్గానికి చెందిన చేనేత కార్మికునితో పాటు అనుబంధ వృత్తుల కార్మికులకు పథకం వర్తింపజేయాలని మురళీధర్‌ కోరారు. తక్షణం చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్

ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..

For More International News And Telugu News

Updated Date - Jul 31 , 2025 | 05:21 AM