Singareni Mining Incident: సింగరేణి భూగర్భ గనిలో ప్రమాదం.. కార్మికులకు అస్వస్థత..
ABN , Publish Date - Sep 18 , 2025 | 06:06 PM
జయశంకర్ భూపాలపల్లిలోని సింగరేణి భూగర్భ గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. కేటీకే 5 ఇంక్లైన్ రెండో లెవెల్ వద్ద వెల్డింగ్ చేస్తున్న క్రమంలో నిప్పు అంటుకుని..
జయశంకర్ భూపాలపల్లి: సింగరేణి భూగర్భ గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. కేటీకే 5 ఇంక్లైన్ రెండో లెవెల్ వద్ద వెల్డింగ్ చేస్తున్న క్రమంలో నిప్పు అంటుకుని విషవాయువులు వెలువడ్డాయి.

ఈ ప్రమాదంలో అన్వేశ్, ప్రదీప్ అనే ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన తోటి కార్మికులు బాధితులను చికిత్స నిమిత్తం సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

మొదటి షిఫ్ట్ ముగిసే సమయానికి ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూ, ఫైర్, సేఫ్టీ సిబ్బంది ముమ్మర సహాయక చర్యలు చేపట్టారు. గని లోపల పంప్ ఆపరేటర్ చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:
ఏపీ అసెంబ్లీ లాబీల్లో మార్షల్స్ అతిప్రవర్తనపై మంత్రి లోకేష్ ఆగ్రహం
చారిత్రాత్మక జీఎస్టీ సంస్కరణలకు ఏపీ తొలి మద్దతుదారు: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News