Share News

Crime News: హైదరాబాదులో విదేశీయురాలిపై దారుణం..

ABN , Publish Date - Apr 01 , 2025 | 10:12 AM

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన విదేశీయురాలిపై గుర్తు తెలియని ముగ్గురు యువకులు అత్యాచారం జరిపారు. దీంతో బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Crime News: హైదరాబాదులో విదేశీయురాలిపై దారుణం..
Crime News..

హైదరాబాదు: నగరంలో దారుణం జరిగింది. విదేశీయురాలి (Foreigner)పై గ్యాంగ్ రేప్‌ (Gang Rape)కు పాల్పడ్డారు. హైదరాబాద్ (Hyderabad) పర్యటనకు వచ్చిన విదేశీయురాలుకు లిఫ్ట్ ఇస్తామని చెప్పి మీర్పేట్ (Meerpet) వద్ద యువకులు ఆమెను తీసుకుని వెళ్లారు. పహాడీ షరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతంలో విదేశీయురాలిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక దాడికి గురైన యువతిని జర్మనీ (Germany) దేశస్థురాలుగా గుర్తించారు. తనపై ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లైంగిక దాడికి గురైన పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read..: ఢిల్లీ బాట పట్టిన అఖిలపక్షం నేతలు..


వివాహితపై దారుణం..

తనపై గుర్తుతెలియని ఏడుగురు సామూహిక అత్యాచారం జరిపినట్లు ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితకు ముగ్గురు పిల్లలు. భర్తతో విభేదాల కారణంగా కొన్నాళ్లుగా అతడికి దూరంగా ఉంటోంది. శనివారం రాత్రి 11 గంటలకు తన బంధువుతో కలిసి నాగర్‌కర్నూలు జిల్లా ఊర్కొండపేట మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయ దర్శనానికి వచ్చింది. ఇద్దరూ స్వామివారిని దర్శించుకొని సమీపంలోని ఓ చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ ఆలయ తాత్కాలిక ఉద్యోగి వీరిని చూసి.. తన స్నేహితులకు సమాచారమిచ్చాడు. కొద్దిసేపటికి ఓ ఆరుగురు అక్కడికొచ్చారు. ఆ ఉద్యోగి సహా ఏడుగురు మద్యం మత్తులో ఆ యువతి, ఆమెతో పాటు వచ్చిన బంధువుతో గొడవపడ్డారు. అనంత రం వివాహితతో వచ్చిన వ్యక్తిని చెట్టుకు కట్టేసి.. ఆమెను పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం జరిపారు. బాధితురాలు సోమవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఘటనా స్థలాన్ని ఎస్పీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌ పరిశీలించారు. నిందితులను ఊర్కొండపేటకు చెందిన మహేశ్‌ గౌడ్‌, మార్పాకుల ఆంజనేయులుగౌడ్‌, మట్ట ఆంజనేయులు గౌడ్‌, సాదిక్‌ బాబా, కౌకుంట్ల హరీశ్‌గౌడ్‌, వాగుల్దాస్‌ మణికంఠ గౌడ్‌, ఎల్లికట్టకు చెందిన కార్తీక్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాత్రి వారిని మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచినట్లు సమాచారం. మరో ఇద్దరు కూడా వీరికి సహకరించినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరి ఆచూకీ కూడా తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్.. కలకలం రేపిన గ్యాంగ్ వార్

ప్రియుడిఫై కోపంతో ఆ మహిళ ఏంచేసిందంటే..

For More AP News and Telugu News

Updated Date - Apr 01 , 2025 | 10:25 AM