Share News

Prime Minister Economic Advisory Council Chairman Mahendra Dev meets CM Revanth Reddy in Hyderabad avn

ABN , Publish Date - Jul 12 , 2025 | 04:12 PM

సీఎం రేవంత్ రెడ్డిని ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి ఛైర్మన్ ఎస్.మహేంద్ర దేవ్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లే అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. ఇంకా..

Prime Minister Economic Advisory Council Chairman  Mahendra Dev meets CM Revanth Reddy in Hyderabad avn
CM Revanth Reddy

హైదరాబాద్, జులై 12: సీఎం రేవంత్ రెడ్డిని ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి ఛైర్మన్ ఎస్.మహేంద్ర దేవ్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది. తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లే అంశంపై ఇరువురి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. సమాఖ్య విధానంలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంతో పాటు సేవా రంగం అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా కూడా పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి

ఫోన్ దొంగతనం.. కట్ చేస్తే భార్య ఎఫైర్ బయటపడింది..

వీధి కుక్కలకు మహర్దశ.. 2 కోట్లతో కొత్త స్కీమ్..

Updated Date - Jul 12 , 2025 | 04:12 PM