Share News

BIG BREAKING: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పు

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:46 PM

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల రద్దుపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది.ఆ క్రమంలో గ్రూప్ 1 నియామకాలు జరుపుకోవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికే కాకుండా.. తీర్పుతో టీజీపీఎస్‌సీకి సతం భారీ ఊరట లభించినట్లు అయింది.

BIG BREAKING: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై హైకోర్టు కీలక తీర్పు

హైదరాబాద్, సెప్టెంబర్ 24: గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్షల రద్దుపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. ఆ క్రమంలో గ్రూప్ 1 నియామకాలు జరుపుకోవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికే కాకుండా.. తీర్పుతో టీజీపీఎస్‌సీకి సైతం భారీ ఊరట లభించినట్లు అయింది.


ఇంతకీ ఏం జరిగిందటే..

గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని.. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలను రద్దు చేయాలంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టులోని సింగిల్ బెంచ్ ధర్మాసనం.. ఈ పరీక్షల జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయించాలని.. లేకుంటే ఆ పరీక్షలను రద్దు చేసి తాజాగా నిర్వహించాలంటూ కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్‌సీ) నిర్ణయించింది. అందులో భాగం దీనిపై తెలంగాణ హైకోర్టును టీజీపీఎస్‌సీ ఆశ్రయించింది.


అయితే మరోవైపు.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల్లో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఎవరో ఒకరు తప్పు చేయడం వల్ల.. మొత్తం అందరిని శిక్షించడం సబబు కాదంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం అంటే.. సెప్టెంబర్ 23వ తేదీ.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆ క్రమంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం నిశీతంగా పరిశీలించింది. అందులో భాగంగా ఈ కేసు తీర్పులో వినియోగించిన పదాలు.. చేసిన వ్యాఖ్యల పట్ల ధర్మాసనం సందేహాలు వ్యక్తం చేసింది.


ఆ సందేహలకు సంబంధించిన సమాధానాలు ఉన్నాయా? అంటూ ప్రశ్నించింది. తీర్పు ఇచ్చేటప్పుడు అన్నింటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఇక పిటిషనర్ తరఫున డాక్టర్ లక్ష్మీనరసింహ హాజరయ్యారు. టీజీపీఎస్‌సీ తరఫు న్యాయవాది రాజశేఖర్ సైతం తన వాదనలు వినిపించారు. ఇప్పటికే దీనిపై టీజీపీఎస్‌సీ అప్పీలు దాఖలు చేసిందంటూ కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో ఈ విచారణను ఈ రోజుకు అంటే బుధవారానికి వాయిదా వేసింది. అయితే ఈ రోజు విచారణలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..

గ్రూప్-1 రద్దుపై హైకోర్టు సంచలన తీర్పు

కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్

For More AP News And Telugu News

Updated Date - Sep 24 , 2025 | 03:04 PM