Share News

Electricity: ఆ ఏరియాల్లో.. 10 గంటల నుంచి విద్యుత్ సరఫరా బంద్..

ABN , Publish Date - Jun 17 , 2025 | 07:16 AM

శాంతినగర్‌ 11కేవీ విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శాంతినగర్‌, రఘుపతిరెడ్డి ఇల్లు ప్రాంతం, కడిమి ఆస్పత్రి, హుడా కేఫ్‌ మెయిన్‌ రోడ్డులో విద్యుత్‌ ఉండదని అధికారులు తెలిపారు.

Electricity: ఆ ఏరియాల్లో.. 10 గంటల నుంచి విద్యుత్ సరఫరా బంద్..

- నగరంలో.. నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..

హైదరాబాద్: శాంతినగర్‌(Shantinagar) 11కేవీ విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శాంతినగర్‌, రఘుపతిరెడ్డి ఇల్లు ప్రాంతం, కడిమి ఆస్పత్రి, హుడా కేఫ్‌ మెయిన్‌ రోడ్డులో విద్యుత్‌ ఉండదని అధికారులు తెలిపారు. అదేవిధంగా హుడాకాలనీ 11కేవీ ఫీడర్‌ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హుడాకాలనీ, వాటర్‌ట్యాంక్‌ ప్రాంతం, పార్కు వెనుక ప్రాంతం, ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ రోడ్డు, ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ మెయిన్‌ రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండదన్నారు.


అడ్డగుట్ట ఫీడర్‌ పరిధిలో..

city1.2.jpg

హైదర్‌నగర్‌: అడ్డగుట్ట 11కేవీ విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో మరమ్మతుల కారణంగా మంగళవారం ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు అడ్డగుట్ట రోడ్డు నంబర్‌ 1 నుంచి 9 వరకు, ఆదిత్యనగర్‌, ప్రగతి రోడ్డులో విద్యుత్‌ ఉండదని ఏఈ దయానంద్‌(AE Dayanand) తెలిపారు. హెచ్‌ఎంటీ హిల్స్‌ ఫీడర్‌ పరిధిలో మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల వరకు హెచ్‌ఎంటీహిల్స్‌, అడ్డగుట్ట రోడ్డు నంబర్‌ 1,2,3,4లలో విద్యుత్‌ ఉండదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

గరిష్టానికి చేరుకుని, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

‘ధరణి’పై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ షురూ

Read Latest Telangana News and National News

Updated Date - Jun 17 , 2025 | 07:16 AM